‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ స్పందన

Published: Friday December 06, 2019
‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘దిశ’ ఉదంతం కనువిప్పు కావాలని, బహిరంగ శిక్షలు అమలు చేయాలని పవన్ కల్యాణ్ à°“ ప్రకటనలో పేర్కొన్నారు. ‘దిశ’ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. à°† కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య ‘దిశ’ à°Žà°‚à°¤ నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని పవన్ భావోద్వేగ ప్రకటన చేశారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం à°ˆ ఆవేదనే అని ఆయన చెప్పారు.
 
 
 
‘దిశ’ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదని, మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకున్న విధంగా ‘దిశ’ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు. à°ˆ సందర్భంగా ‘దిశ’ ఆత్మకు శాంతి కలగాలని, à°ˆ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.