మహిళపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Published: Saturday December 28, 2019

à°“ మహిళ పట్ల వైసీపీ ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌ దురుసుగా ప్రవర్తించారు. రేషన్‌కార్డు అడిగినందుకు మహిళను బెదిరిస్తూ.. వార్నింగ్ ఇచ్చారు. రేషన్‌కార్డు ఇవ్వాలంటూ అమె.. ఎమ్మెల్యే చేతులు పట్టుకుని ప్రాధేయపడింది. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌.. చేయి వదులు అంటూ తీవ్ర స్వరంతో గద్దించారు. పనులు కావాలంటే బతిమాలుకోవాలి.. అంతేకానీ బెదిరిస్తే‌‌.. బెదిరేవాళ్లు ఎవరు లేరని మహిళపై సీరియస్ అయ్యారు. ఎలా అడగాలో తెలియకపోతే ఇబ్బందిపడతావంటూ మహిళను ఎమ్మెల్యే హెచ్చరించారు. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం సచివాలయం భవనం వేదికగా à°ˆ ఘటన చోటుచేసుకుంది.