వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది చంద్రబాబు, లోకేష్‌లే

Published: Sunday January 12, 2020

 à°µà±ˆà°¸à±€à°ªà±€ తలుపులు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలందరూ అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చివరకు మిగిలేది చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరి బాలకృష్ణ సంగతేమిటని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన మీదున్న కేసును రీఓపెన్‌ చేయిస్తామంటే ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారన్నారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహాయంతోనే బయటపడ్డారని గుర్తుచేశారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలను బెదిరింపులతో చేర్చుకుంటారా అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పలేదు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమకు చేసింది శూన్యమని విమర్శించారు. ఇప్పుడు కూడా అమరావతి పేరిట స్వలాభం కోసమే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.