రాజధాని రైతులకు 17 వరకు గడువు

Published: Monday January 13, 2020
రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో కమిటీ సభ్యులు భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జిల్లాల అభివృద్ధిపై హైపవర్‌ కమిటీలో చర్చించామని.. ఈనెల 17à°¨ మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజధాని రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో.. రాతపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్‌కు 17లోగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. à°ˆ మెయిల్‌ ద్వారా సూచనలు, సందేహాలు పంపాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర ప్రాంతాల మహిళలను వాడుకుంటున్నారని.. à°ˆ ప్రాంతం కాని వారిని, మహిళలను తీసుకొచ్చి.. రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సానుభూతి కోసం ప్రీప్లాన్డ్‌à°—à°¾ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు ధర్నాలు ప్లాన్ చేస్తున్నారన్నారు. వీటి వెనక టీడీపీ ఉందని తెలిపారు.
 
 
ఏం జరగబోతుందనేదానిపై రైతులకు ఓ క్లారిటీ ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ 29 గ్రామాల్లోని నిజమైన రైతాంగానికి అర్థమైందని తెలిపారు. ఆందోళనల్లో అందరూ ఉన్నారని.. అయితే రైతాంగంతో పాటు రాజకీయంగా ప్రేరేపించిన వాళ్లు కూడా పాల్గొంటున్నారన్నారు. రాజకీయంగా సానుభూతి పొందడానికి.. ముందస్తు ప్రణాళికతో నిరసనలు చేస్తున్నారన్నారు. పోలీసులను రెచ్చగొట్టేందుకు.. పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు. తాము రైతుల గురించి చర్చించని రోజు లేదని.. రైతులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రైతులు వ్యక్తిగతంగా కూడా కలుస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రేరేపిత బృందాలు దాడులు చేస్తాయనే భయంతో వారి బాధలను, ప్రతిపాదనలను తెలుపుతున్నారన్నారు.