అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

Published: Monday January 20, 2020

అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి భారీగా రైతులు తరలివస్తున్నారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా రైతులు చుట్టుముట్టారు. దీంతో రైతులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు లాఠీఛార్జ్‌à°•à°¿ దిగారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు తెంచుకుని రైతులు నలువైపులా సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం మెయిన్‌ గేట్‌ దగ్గరకు రాజధాని రైతులు చేరుకున్నారు. రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రైతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళల నిరసనకు దిగారు. మీడియా దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు.