హైకోర్టును ఆశ్రయించిన జగన్

Published: Monday January 27, 2020

 à°¸à±€à°Žà°‚ జగన్ తన అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడాన్ని జగన్ సవాల్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హైకోర్టులో ఇదే పిటిషన్ వేశారు. అయితే సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.