సిట్‌కు ఫిర్యాదు చేసుకోండి

Published: Wednesday February 26, 2020

పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా మార్పురావడంలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై సీబీఐ దర్యాప్తు పడినందుకు సిగ్గుపడాలన్నారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించేస్థాయికి పోలీసులు వెళ్లారని దుయ్యబట్టారు. డీజీపీ ఆఫీసులో నిర్ణయాలు సీఎం సన్నిహితులు తీసుకుంటున్నారని ఆరోపించారు. డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై సీబీఐ విచారణ చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. సజ్జల సూచనల మేరకే పోలీసుశాఖలో పోస్టింగ్‌లు ఇస్తున్నారన్నారు. కృష్ణాకు వరదలు వచ్చినా నీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యానించారు. ‘నాపై సిట్‌కు ఫిర్యాదు చేసుకోండి, భయపడేది లేదు’ అని దేవినేని ఉమ సవాల్ విసిరారు.