రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5వేలు

Published: Tuesday June 09, 2020

ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5వేలు మార్క్ దాటింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులతో కలిపి కేసులు 5,029à°•à°¿ చేరాయి. 

 

రాష్ట్రంలో à°—à°¤ 24 గంటల్లో 15,085 శాంపిల్స్‌ను పరిశీలించగా 147 మంది కోవిడ్-19 పాజిటివ్‌à°—à°¾ తేలారు. 16 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా కృష్ణాలో ఒకరు, అనంతపురం జిల్లాలలో ఒకరు మరణించారు. ఇవి రాష్ట్రంలో నివసించే వారికి సంబంధించిన లెక్కలు మాత్రమే. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని 5029 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2403 మంది డిశ్చార్జ్ కాగా, 77 మంది మరణించారు. ప్రస్తుతం 1510 మంది చికిత్స పొందుతున్నారు.