టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ

Published: Tuesday June 09, 2020

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో టీడీపీకి బలమైన నాయకుడు, జాతీయ కోశాధికారి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. à°† పార్టీకి భారీ ఝలక్ ఇచ్చారు. కుమారుడు సుధీర్‌తో కలిసి శిద్దా రాఘవరావు రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 

శిద్దా రాఘవరావు... à°—à°¤ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీలో ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, జాతీయ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి మాగుంట చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరు సంపాధించారు. ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో కొనసాగుతున్నారు. శిద్దా...టీడీపీ నుండి గతంలో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ వీడతారని జోరుగా ప్రచారం జరిగింది. మొత్తం మీద ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఇప్పటికే చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. శిద్దా బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.