ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇవే

Published: Tuesday June 16, 2020

ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు.

 

బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే:

వ్యవసాయానికి రూ.11,891 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు

ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు

వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు

ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు

ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు

కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు

బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు

విద్యశాఖకు రూ.22,604 కోట్లు

వైద్య రంగానికి రూ.11,419 కోట్లు

ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు

వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు

పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు

పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు

బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు

డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు

రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు

వైఎస్‌ఆర్‌ ఆసరాకు రూ.6,300 కోట్లు

అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు

జగనన్న విద్యాదీవెనకు రూ.3,009 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు

జగనన్న వసతి దీవెనకు రూ.2 వేల కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్రకు రూ.275 కోట్లు

జగనన్న చేదోడుకు రూ.247 కోట్లు

నేతన్న నేస్తం రూ.200 కోట్లు

మత్స్యకార భరోసాకు రూ.109 కోట్లు