టిక్‌టాక్ కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాప్

Published: Wednesday July 01, 2020

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ భారత్‌లో టిక్‌టాక్ నిషేధంపై స్పందించారు. టిక్‌టాక్ కేవలం à°’à°• ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ మాత్రమేనని ఆమె చెప్పారు. టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించడం దుందుడుకు నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనే వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు. à°ˆ నిర్ణయం వల్ల చాలామంది నోట్ల రద్దు సమయంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

 

దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ను నిషేధించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ à°ˆ ప్రశ్నలన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ రాజకీయాల్లోకి రాకముందు దాదాపు 20 చిత్రాల్లో నటించారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నుస్రత్ జహాన్ బసిర్హట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తృణముల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.