ఏపీలో 765 కరోనా పాజిటివ్ కేసుల

Published: Saturday July 04, 2020

 à°à°ªà±€à°²à±‹ నేడు 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు. ఏపీలో 727 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి... ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌‌à°—à°¾ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17699à°•à°¿ చేరుకుంది.

 

కర్నూలు, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున విశాఖపట్టణం, చిత్తూరులో ఇద్దరు చొప్పున, à°•à°¡à°ª, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 218à°•à°¿ చేరుకుంది. కాగా.. 9,473యాక్టివ్‌ కేసులుండగా.. 8008 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 9,96,573 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.