కరోనా కొత్త లక్షణాలివే..

Published: Sunday July 05, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ కొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది. ఇప్పటివరకూ జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గునే కరోనా ప్రధాన లక్షణాలుగా పరిగణించారు. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలే కనిపించాయి. కొందరు వాసన గ్రహించే శక్తిని కోల్పోయి ఈ వైరస్ బారిన పడ్డారు.

 

మరికొందరిలో.. ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. అయితే.. కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు తెలిసింది. దీంతో.. ఇన్నాళ్లూ కరోనా ఊపిరితిత్తుల పైనే ప్రభావం చూపుతోందని భావించిన వైద్యులకు à°ˆ కొత్త లక్షణాలు సవాల్ విసురుతున్నాయి. 

 

తలనొప్పి, వాంతులు, విరేచనాలను సాధారణ అనారోగ్య సమస్యలుగా పరిగణించరాదని, à°ˆ మూడు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే.. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) à°ˆ మూడింటితో పాటు మరో మూడు లక్షణాలను కరోనా లక్షణాలుగా ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అయితే.. కరోనా బారిన పడుతున్న వారిలో ఇవి కొత్తగా కనిపిస్తున్న లక్షణాలని వైద్యులు చెబుతున్నారు.