ఏపీలో కొత్తగా 1178 కరోనా కేసులు

Published: Tuesday July 07, 2020

 à°†à°‚ధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడంలేదు. కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. à°—à°¤ 24 గంటల్లో 13 మంది చనిపోయారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తంగా 21,197 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో 1155 కేసులు నమోదు కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన à°’à°•à°°à°¿à°•à°¿ కరోనా పాజిటీవ్ వచ్చింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగే కొద్ది మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, ప్రకాశం, à°ª.గోదాదరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 252కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 85 మంది మరణించగా, కృష్ణా జిల్లాలో 70 మంది మరణించారు.