ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతల దోపిడీ

Published: Tuesday July 07, 2020

పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతిపై నిరసనలు చేస్తున్న వారికి దిశానిర్దేశం చేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు హౌసింగ్‌ అంటూనే వారి ఇళ్లు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు?, టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుస్తున్నారు. టీడీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు కట్టించాం. గ్రామీణ ప్రాంతాల్లో 2.5 నుంచి 3 సెంట్ల స్థలం ఇచ్చాం. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారు. కరోనాను అదుపు చేయడం మానేసి రాజకీయ కక్షలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారు.’’ అని మండిపడ్డారు.  అలాగే కుప్పం హౌసింగ్‌ బాధితులతో కూడా చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు.