టీడీపీ శ్రేణుల తీవ్ర నిరసన

Published: Tuesday July 07, 2020

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయి మచిలీపట్నం సబ్‌ జైలులో ఉన్న మాజీమంత్రి కొల్లు రవీంద్రను సోమవారం సాయంత్రం పోలీసు బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. రవీంద్రతో పాటు హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింతా నాంచారయ్య(చిన్ని) చింతా నాంచారయ్య(పులి), చింతా నాగమల్లేశ్వరరావులను కూడా ప్రత్యేక వాహనంలో రాజమండ్రికి తరలించారు.  కాగా, కొల్లు రవీంద్రను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు సబ్‌జైలు సమీపంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరందరినీ పోలీసులు పంపివేశారు.