దలైలామా కీలక వ్యాఖ్యలు

Published: Friday July 10, 2020

లడాఖ్ ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు కొద్దికొద్దిగా సర్దుమణుగుతున్నాయి. à°ˆ నేపథ్యంలో టిబెట్ మత గురువు దలైలామా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు సరిహద్దు కారణంగా కయ్యానికి కాలుదువ్వుకోవద్దని అన్నారు. రెండు దేశాలూ శక్తిమంతమైన దేశాలని, పక్క దేశాన్ని దెబ్బతీయాలని ఏ దేశం అనుకున్నా రెండు దేశాలు నష్టపోతాయని హితవు పలికారు. పక్కపక్కనే ఉంటూ స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. ‘భారత్-చైనాలు ప్రపంచంలోనే పురాతనమైన చారిత్రక మూలాలు కలిగిన దేశాలు. 100కోట్లకు పైగా జనాభా కలిగిన దేశాలు కూడా. ఇలాంటి దేశాల మధ్య ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో పోటీ తత్వం మొదలైంది. అయితే ఇరు దేశాలూ శాంతియుతంగా, ఆరోగ్యకరమైన పోటీ విధానాన్నే అవలంబించాలి. ముఖ్యంగా à°“ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చైనా చరిత్రలో శాంతికి చిహ్నమైన బౌద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

 

అలాంటి బౌద్ధానికి ఆది గురువైన బుద్ధుని జన్మస్థలం భారతదేశం. à°ˆ రెండు దేశాలు శాంతికి మారుపేరుగా ఉంటూ పరస్పరం  సహకారంతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల’ని దలైలామా ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే టిబెటన్ ఉద్యమం, ప్రభుత్వ పరిపాలనా విషయాలపై దలైలామా 2011 నుంచి దలైలామా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ భారత్-చైనా విషయంలో ఆయన స్పందించడం గమనార్హం.