‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో అక్కినేని సమంత

Published: Saturday July 11, 2020

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ à°’à°• యజ్ఞంలా ముందుకు సాగుతోంది. à°ˆ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత à°ˆ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. 

 

à°ˆ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘‘జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది à°’à°• ఆయుధంలా  పనిచేస్తుంది. à°ˆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనకు ధన్యవాదాలు. నా అభిమానులు à°ˆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి’’ అన్నారు. కో స్టార్స్ కీర్తి సురేశ్, రష్మిక మందన్నలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని సమంత కోరారు.