రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

Published: Monday July 13, 2020

 à°Ÿà±à°°à°¾à°µà±†à°¨à±‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు ఇచ్చింది. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. à°—à°¤ 9ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తెరపడింది. 

 

కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం మేనేజ్‌మెంట్ వివాదంపై సుప్రీం కోర్టు à°ˆ మేరకు తీర్పు ఇచ్చింది. 2011 జనవరి 31à°¨ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం.. à°—à°¤ ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

 

ఆలయానికి సంబంధించిన సంపద, నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించి à°’à°• కమిటీ వేయాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆలయంపై తమకు హక్కులు ఉంటాయని, భక్తులకే à°ˆ దేవాలయం చెందుతుందని పేర్కొంటూ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.