రాజ్యసభ సభ్యులతో సమావేశమైన ప్రధాని మోదీ

Published: Wednesday July 22, 2020

నూతనంగా ఎన్నికైన బీజేపీ రాజ్యసభ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. విధానపర నిర్ణయాలపై అప్‌డేట్‌à°—à°¾ ఉండాలని మోదీ వారికి సూచించారు. అటు ప్రజలతో, ఇటు సభలో చురుకుగా ఉంటూ బాధ్యతల నిర్వహణ చేయాలని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో, సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉండాలన్నారు.

 

‘‘నూతనంగా ఎన్నికైన బీజేపీ రాజ్యసభ సభ్యులతో సంభాషణ చాలా అద్భుతంగా జరిగింది. ప్రజా సేవకు సంబంధించివారి అభిప్రాయాలు, అభిరుచులు వినడం చాలా అద్భుతంగా ఉంది. ఇది విభిన్నమైన ఎంపీలతో ఉన్న బృందం. పార్లమెంటరీ కార్యకలాపాలను కచ్చితంగా పాటించేట్లు కృషి చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.