లక్ష దాటిన కరోనా కేసులు

Published: Monday July 27, 2020

ఏ రోజుకారోజు రికార్డులను కరోనా అధిగమిస్తూ వస్తోంది. సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. à°ˆ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు చేశారు. à°ˆ టెస్టుల్లో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. à°ˆ కేసులతో కలిపి 1,02,349à°•à°¿ కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో 49,558 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 16,86,446 కరోనా టెస్టులు చేశారు. ఇక మరణాలు కూడా ఏపీని వణికిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 1,090 మృతి చెందారు. 

ఎప్పటిలాగే ‘తూర్పు’à°¨ కరోనా విజృభిస్తోంది. తూర్పగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి పట్టిపిడిస్తోంది. à°ˆ రోజు అత్యధికంగా 1,210 కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లా కేసుల్లో రెండో స్ధానంలో ఉంది. 744à°•à°¿ కరోనా సోకింది. కర్నూలు జల్లాలో 664, విశాఖ జిల్లాలో 655, అనంతపురం జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 422,  పశ్చిమగోదావరి జిల్లాలో 408, చిత్తూరు జిల్లాలో 367, à°•à°¡à°ª జిల్లాలో 336, ప్రకాశం జిల్లాలో 317, విజయనగరం జల్లాల్లో 157, శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు నమోదయ్యాయి.