‘నాకు ప్రాణాపాయం ఉంది.

Published: Wednesday July 29, 2020

నాకు ప్రాణాపాయం ఉంది. అందువల్ల తక్షణమే కేంద్ర బలగాలతో వ్యక్తిగత భద్రత కల్పించాలి’ అంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. à°ˆ మేరకు మంగళవారం ఆయన హోంశాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన వినతికి హోం కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, à°ˆ వారంలోనే తనకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. à°† వెంటనే తన నియోజకవర్గం (నరసాపురం) వెళ్తానన్నారు. తమ జిల్లా మంత్రి కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించారని మరోసారి ఆరోపించారు. తమ జిల్లాలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ నుంచే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్నానని చెప్పారు. 

 

బీజేపీ ఏపీ శాఖ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు రఘురామకృష్ణంరాజు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.