కుప్పకూలిన క్రేన్.. 10మంది మృతి

Published: Saturday August 01, 2020

నగరంలోని హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు.  వివరాల ప్రకారం క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో 10 మంది ఉండగా అందరూ చనిపోయారు. విరిగిపడ్డ క్రేన్‌ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులు షిప్ యార్డుకు చేరుకున్నారు. అయితే వారిని లోనికి అనుమతించడం లేదు. 

 

గత కొన్నిరోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా.. తాజాగా షిప్ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడచిన మూడు నెలల్లో జరిగిన వరుస ఘటనలు సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.