విశాఖ నగరానికి నైట్రేట్‌ ముప్పు?

Published: Thursday August 06, 2020

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టులో టపాసులు నిల్వచేసే కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించి వంద మంది మరణించగా, నాలుగు వేల మంది వరకు గాయపడ్డారు. అమోనియం నైట్రేట్‌ నిల్వలే à°ˆ పేలుడుకు కారణమని, భారీ నిల్వలు ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే విశాఖపట్నం పోర్టులోనూ ఇదే తరహా ప్రమాదమే పొంచి ఉంది. రష్యా, గల్ఫ్‌ దేశాల నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా ప్రైవేటు వ్యాపారులు అమోనియం నైట్రేట్‌ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నారు. నౌకల నుంచి అన్‌లోడ్‌ చేసుకుని, సమీపంలోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. తరువాత ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు పంపుతున్నారు. ఏటా సుమారు రెండు లక్షల టన్నుల అమోనియం నైట్రేట్‌ దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

 

అమోనియం నైట్రేట్‌కు పేలుడు స్వభావం వుంది. దీనిని ఎరువుల తయారీతోపాటు గనులు, గ్రానైట్‌, రాయి క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగిస్తారు. à°ˆ అవసరాల కోసమే దిగుమతి చేసుకుంటున్నారు. అయితే కొన్ని సంఘ విద్రోహశక్తులు అక్రమ మార్గంలో అమోనియం నైట్రేట్‌ను చేజిక్కించుకొని, అత్యంత శక్తిమంతమైన ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌(ఐఈడీ) తయారీకి ఉపయోగిస్తున్నారు. కేవలం à°…à°° కిలో అమోనియం నైట్రేట్‌తో 100 మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించవచ్చు. అందువల్ల దీనిని దిగుమతి, నిల్వ, రవాణా చేయడానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం తప్పదు. విశాఖపట్నంలోని పరిశ్రమల్లో  ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు సంభవిస్తూ, భారీ ప్రాణనష్టం జరుగుతున్నది. à°ˆ నేపథ్యంలో జిల్లా అధికారులు అమోనియం నైట్రేట్‌పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.