జేసీ ప్రభాకర్, అస్మిత్‌ మళ్లీ అరెస్ట్

Published: Friday August 07, 2020

 à°Ÿà±€à°¡à±€à°ªà±€ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడం గమనార్హం. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం నాడు అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఏకంగా ప్రభాకర్‌రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద à°•à°¡à°ª నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేయడం జరిగింది. 

 

కాగా.. ఇవాళ జేసీపై మొత్తం 5 కేసులు నమోదు చేసినట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు. నిన్న దళిత సీఐ దేవేంద్రను దూషించినట్లు జేసీపై ఆరోపణలు వచ్చాయి. à°•à°¡à°ª నుంచి తాడిపత్రి వరకు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసులు నమోదు చేశారు. జేసీపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 52 à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జేసీ అరెస్ట్ సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు à°ˆ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.