స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు అరెస్ట్

Published: Monday August 10, 2020

విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌తో రమేష్‌ ఆస్పత్రి ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

మరోవైపు.. స్వర్ణ ప్యాలెస్‌ను జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ కమిటీ సభ్యులు పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై ఇప్పటికే à°“ అంచనాకు వచ్చామని.. రెండు రోజుల్లో నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని శివశంకర్‌ మీడియాకు వెల్లడించారు. అగ్నిప్రమాదంపై రాష్ట్ర స్థాయిలో మరో రెండు కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా.. à°ˆ అగ్నిప్రమాదంపై మూడు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. 

 

రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణా ప్యాలెస్‌లో à°’à°• బృందం తనిఖీలు చేస్తోంది. ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు తీసుకుంటున్న ప్రమాణాలపై కూడా దర్యాప్తు చేస్తోంది. మరోబృందం షార్ట్ సర్క్యూట్‌కు à°—à°² కారణాలపై తనిఖీలు చేస్తోంది. మూడవ బృందం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది. సోమవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.