రోహిత్ శర్మకు ప్రతిష్ఠాత్మక పురస్కారం!

Published: Tuesday August 18, 2020

 à°•à±à°°à±€à°¡à°²à±à°²à±‹ అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కమిటీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లు ఇందులో ఉన్నాయి. రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున తదితర క్రీడా అవార్డులకు నామినీలను ఎంపిక చేసేందుకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కమిటీ మంగళవారం సమావేశం అయింది. అనంతరం రాజీవ్ ఖేల్‌రత్న నామినీల పేర్లను ప్రకటించింది. కమిటీ ప్రతిపాదించిన à°ˆ పేర్లను కేంద్ర క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు అమోదించాల్సి ఉంది. ఆయన ఆమోదం అనంతరంం రాష్ట్రపతి అభ్యర్థులకు అవార్డులను అందజేస్తారు. ఇదిలా ఉంటే క్రికెటర్ రోహిత్ శర్మ పేరు కూడా ఇందులో ఉండడంతో క్రికెట్ అభిమానులు తెగ సంబర పడుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు తప్పక à°ˆ అవార్డు లభిస్తుందంటూ జోస్యం చెబుతున్నారు.