అక్రమ చొరబాటుదారుల్ని కాల్చి చంపిన భారత సైన్యం

Published: Saturday August 22, 2020

పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు అక్రమ చొరబాటుదారుల్ని భారత సైన్యం శనివారం కాల్చి చంపింది. పంజాబ్ జిల్లాలోని తర్నాతరణ్‌ ప్రాంతం నుంచి à°ˆ ఐదుగురూ అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. à°ˆ ప్రయత్నాన్ని గమనించిన భారత జవాన్లు à°ˆ అక్రమ చొరబాటు దార్లను కాల్చి చంపేశారు. à°ˆ ఐదుగురూ పాక్ తీవ్రవాదులేనని అధికారులు పేర్కొన్నారు.

 

అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించే క్రమంలో లొంగిపోవాలని తాము కోరామని, అయినా సరే à°† అక్రమ చొరబాటు దారులు వినకపోవడంతో వారిపై కాల్పులు ప్రారంభించామని, ఐదుగురు మరణించారని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి ఏకె -47తో పాటు ఆయుధాలతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది. à°ˆ ఘటనతో సరిహద్దుల వెంబడి ఆర్మీ మరింత నిఘాను పెంచింది. 

 

దీని కంటే కొద్ది రోజుల ముందు కూడా అచ్చు ఇలాంటి సంఘటనే à°’à°•à°Ÿà°¿ జరిగింది. గుజరాత్ -రాజస్థాన్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశించాలని అక్రమ చొరబాటుదార్లు ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన జవాన్లు వారిని కాల్చి చంపారు.