బీజేపీ రాష్ట్ర కార్యాలయం.. ఐదుగురికి కరోనా

Published: Sunday August 23, 2020

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కార్యాలయ సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందే. తాజాగా 40 మందికి పరీక్షలు చేయగా ఐదుగురు పాజిటివ్‌à°—à°¾ తేలారు. దీంతో పార్టీ ఆఫీసులో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. శానిటైజేషన్ చేసే ప్రక్రియను చేపట్టామని, ఇక కరోనా పాజిటివ్ సోకిన ఉద్యోగులను క్వారంటైన్‌à°•à°¿ తరలించామని నేతలు తెలిపారు. 

కరోనా ప్రభావంతో వారం పాటు కార్యాలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే కరోనా నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలోకి పరిమిత సంఖ్యలో కార్యాలయం సిబ్బందిని అనుమతిస్తున్నారు. అయినా కరోనా బారిన పడటంతో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.