విజయవాడలో విశాఖ స్టీల్ బ్రాంచి మూసివేత.

Published: Tuesday September 22, 2020

విజయవాడలోని భవానీపురంలో ఆసియాలోనే అతిపెద్ద స్టీల్‌ యార్డు ఉంది. ఇక్కడ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, టాటా స్టీల్‌ తదితర దిగ్గజ సంస్థలు రెండు దశాబ్దాలుగా స్టాక్‌ పాయింట్లను నిర్వహిస్తున్నాయి. స్టీల్‌ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌à°—à°¾ ఉన్న విజయవాడలో తమ శాఖను ఏర్పాటుచేస్తే à°ˆ ప్రాంత ప్రజలకు విశాఖ ఉక్కు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం 2016, ఫిబ్రవరి 26à°¨ ఇక్కడ బ్రాంచిని ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా విజయవాడ పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా 2017లో స్టాక్‌ పాయింట్‌నూ ఏర్పాటుచేశారు.

ఉన్నతాధికారుల అంచనాలను నిజం చేస్తూ విజయవాడ స్టాక్‌ పాయింట్‌ అద్భుతమైన టర్నోవర్‌ను సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.25 లక్షల టన్నుల విక్రయాలతో విజయవాడ స్టాక్‌ పాయింట్‌ దేశంలోనే అత్యధిక లాభాలు సాధించింది. స్థానికంగా స్టాక్‌ పాయింట్‌ అందుబాటులో ఉంటే రవాణా వ్యయం తగ్గడంతో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో విశాఖ స్టీల్‌ ఉత్పత్తులను అందించే వెసులుబాటు ఉంటుంది. విశాఖ స్టీల్‌ప్లాంటుకు దేశవ్యాప్తంగా 25 శాఖలుండగా, డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉన్న భువనేశ్వర్‌, ఆగ్రా, ఫరీదాబాద్‌ తదితర నగరాల్లో స్టాక్‌ పాయింట్లను నిర్వహిస్తున్న విశాఖ స్టీల్‌ యాజమాన్యం డిమాండ్‌ అధికంగా ఉన్న విజయవాడలోని స్టాక్‌ పాయింట్‌ను ఎత్తివేయాలని చూడటం విస్మయానికి గురిచేస్తోంది. స్టీల్‌ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌ అయిన విజయవాడలో బ్రాంచిని మూసివేసిన స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాహకులు స్టాక్‌ పాయింట్‌నూ మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలకు కాకుండా బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.