ఓటు బ్యాంకు పెంచుకోవడానికే ఇదంతా

Published: Saturday September 26, 2020

దేవాలయాలపై దాడుల వెనుక మత మార్పిడుల ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. à°ˆ దాడుల వెనుక à°’à°• చీకటి ఎజెండా ఉందని.. మత మార్పిడులను పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సింహాచలం నుంచి మొదలైన దాడులు తిరుమల వరకూ విస్తరించాయని à°ˆ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ‘దేవాలయాల్లో సంప్రదాయాలను హేళన చేయడం, అపచారాలకు పాల్పడడం, భక్తుల మనోభావాలను గాయపరచడం వంటివి యథేచ్ఛగా చేస్తున్నారు.

 

ఆంజనేయ స్వామి విగ్రహం చేయి పోతే దేవుడికి ఏమవుతుంది..? రథం పోతే రథం చేయిస్తాం.. సింహాలు పోతే సింహాలు చేయిస్తామని మంత్రులు కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. భక్తులు నొచ్చుకొంటున్నారన్న కనీస జ్ఞానం కూడా లోపిస్తోంది. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో గెలవగానే జెరూసలేం వెళ్లి వచ్చారు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే భక్తి. ముస్లింలు అల్లాను పూజిస్తారు. మనకు ఉన్నట్లే ఎదుటివారికి కూడా నమ్మకాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. దేవాలయాల్లో ఇన్ని ఘటనలు జరిగితే ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదు’ అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల వెంటపడి వెన్నాడి జైలుకు పంపారని, కానీ జగన్‌ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురైతే పట్టించుకున్న దిక్కు లేదని వ్యాఖ్యానించారు.