యూజర్ ఛార్జీల పేరుతో టికెట్ ధరల పెంపు

Published: Tuesday September 29, 2020

భారతీయ రైల్వే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. యూజర్ ఛార్జీల పేరుతో టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో à°ˆ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. à°ˆ యూజర్ ఛార్జీల పేరుతో వచ్చిన సొమ్మును భారత్ లోని కొన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేటాయించాలని రైల్వే శాఖ భావిస్తోంది. à°ˆ యూజర్ ఛార్జీలు 10 రూపాయలు మొదలుకుని 35 రూపాయల వరకూ ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే.. ఇలా యూజర్ ఛార్జీలను విధించాలని భారతీయ రైల్వే భావిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూజర్ డెవలప్‌మెంట్ à°«à±€(యూడీఎఫ్) పేరుతో à°ˆ ఛార్జీలను విధించనున్నట్లు తెలిసింది.