ఏనుగు దాడిలో ఇద్దరు మృతి

Published: Wednesday September 30, 2020

జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. పంటపొలాలు నాశనం చేసిన ఏనుగు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఏనుగు దాడిలో మృతి చెందిన సోనియా(16), రపల్లె పాపమ్మ(66) ప్రాణాలు కోల్పోయారు. మృతుల ఒక్కో కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధికసాయం ప్రకటించింది. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా కంచెలు ఏర్పాటు చేస్తామని సీసీఎఫ్‌ రామకృష్ణ పేర్కొన్నారు.