డెయిరీ రంగంపై దొంగ దెబ్బ

Published: Monday October 19, 2020

డెయిరీ రంగంపై దొంగ దెబ్బ పడనుంది. ఇకపై పాల సేకరణలోనూ ప్రభుత్వ జోక్యానికి à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. ఇక్కడ ఉత్పత్తయ్యే పాలల్లో అధికశాతం ‘అమూల్‌’కు ధారాదత్తం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉండగా... ఇవేవీ కాదని గుజరాత్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో కొత్తగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘విజయ’ బ్రాండ్‌ పేరుతో వీటిలో సేకరించిన పాలను అమూల్‌కు ధారపోసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా సహకార రంగంలో నడుస్తున్న డెయిరీలు నిర్వీర్యం కావడంతో పాటు ప్రైవేటు డెయిరీల మనుగడకూ ప్రమాదం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో పాడిరైతులను ఆదుకుంటామని, లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని వాగ్దానం చేశారు. వైసీపీ నవరత్నాల్లో à°ˆ హామీ కూడా à°’à°•à°Ÿà°¿. కానీ అధికారం చేపట్టాక 2019-20 బడ్జెట్‌లో పాడిరైతుల బోన్‌సకు నిధులు కేటాయించలేదు. వచ్చే ఏడాది నుంచి బోనస్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు.

 

కానీ 2020-21 బడ్జెట్‌లో à°† ఊసెత్తకుండా.. అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.. పాల సేకరణలో అమూల్‌ అడుగుపెట్టడం వల్ల పాడి రైతులకు మంచి(అదనపు) ధర వస్తుందని సీఎం జగన్‌ ప్రకటించారు. దీంతో పాలకేంద్రానికి పోస్తే లీటరుకు రూ.4 అదనంగా వస్తాయని ఆశించిన పాడి రైతులకు ప్రభుత్వ తత్వం ఆలస్యంగా బోధపడింది. పైగా ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే పాలు పోయాలన్న సంకేతాలతో మోసపోయామని భావిస్తున్నారు. ఆర్బీకేల్లోని పాల కేంద్రాల్లోనే పాలు పోయాలన్న షరతు విధించే దిశగా పాడి రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ మాట వినని వారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని కట్‌ చేసే ఆలోచన ఉందన్న చర్చ గ్రామాల్లో సాగుతోంది. పాల సేకరణ కోసం 11,600 గ్రామాల్లోని ఆర్బీకేల్లో పాల సేకరణ కేం ద్రాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 6వేలపై గ్రామాల్లో వీటిని తెరవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఏపీ డెయిరీ రంగంలో అడుగుపెట్టడానికి అమూల్‌ సంస్థ పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆనంద్‌ డెయిరీ సాంకేతికతను ఏపీకి తీసుకొచ్చి, పాల వ్యాపారం చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ఉద్దేశంతో అమూల్‌ పెద్దలు వెనుకాడగా, రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్‌ ఉన్నతాధికారులు వారితో చర్చించి మరీ ఒప్పించినట్లు సమాచారం. దీంతో చెన్నై బ్రాంచ్‌ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. విజయ డెయిరీ ద్వారా ప్రభుత్వమే పాల సేకరణ చేసి, అమూల్‌కు అప్పగించేలా ఒప్పందం కుదిరినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా à°ˆ విధానంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెద్దగా పెరిగే అవకాశాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.