నవంబరు 2 నుంచి స్కూళ్లు

Published: Wednesday October 21, 2020

 à°²à°¾à°•à±‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి నవంబరు 2à°µ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని, అవి కూడా à°’à°‚à°Ÿà°¿ పూటకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. à°ˆ మేరకు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల అంశంపై సీఎం జగన్‌ చర్చించారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, అయితే, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

 

పాఠశాలలు ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿà°² వరకు పనిచేయాలని స్పష్టం చేశారు. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు à°’à°• రోజు, 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహించాలన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, భోజనం పెట్టాక విద్యార్థులను ఇంటికి పంపేయాలని ఆదేశించారు.