రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీపీఎం కౌంటర్‌ దాఖలు

Published: Wednesday November 04, 2020

 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీపీఎం కౌంటర్‌ దాఖలు చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేరుతో హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని, రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసం కాదని సీపీఎం పేర్కొంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించింది కేంద్రమే కదా అని మధు ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు. రాజధాని నిర్మాణాలకు కేంద్రం రూ.2 వేల 500 కోట్ల నిధులు కేంద్రం ఎలా ఇచ్చిందని, రాజధానిలో వేల కోట్లను ఖర్చు చేసిన తర్వాత రాజధాని తరలింపు యోచనను ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్ ఏమిటి..? అని మధు ప్రశ్నించారు. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని, రాజధాని తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు. తరలింపు ఆలోచన ప్రజాప్రయోజనాలకు, రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకమన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదని కౌంటర్‌అఫిడవిట్‌లో మధు పేర్కొన్నారు.