తిరుపతిని మాకొదిలేయండి

Published: Tuesday November 24, 2020

ఉప ఎన్నిక జరిగే తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ అధిష్ఠానంతో చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలసి పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమయ్యామని, అందువల్ల తిరుపతిలో తమకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. తిరుపతిలో ప్రజారాజ్యం తరఫున చిరంజీవి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వైనాన్ని, అక్కడ à°“ బలమైన సామాజికవర్గం ఆది నుంచి జనసేనకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటున్న విషయాన్ని పవన్‌ బీజేపీ అధిష్ఠానానికి వివరించనున్నారని చెబుతున్నారు. అయితే తిరుపతిని తమ బలమైన స్థావరంగా భావిస్తున్న బీజేపీ à°† స్థానాన్ని వదులుకుంటుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి