అసెంబ్లీలో పోలవరం రగడపై చంద్రబాబు

Published: Wednesday December 02, 2020

పోలవరంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ సాగింది.. వైఎస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదిక జరిగాయని వైఎస్ జగన్ అన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా స్పందిస్తూ ‘‘ వైఎస్‌ కంటే ముందు పోలవరానికి అంజయ్య శంకుస్థాపన చేశారు. వైఎస్‌ హయాంలో పోలవరం కాలువలు తవ్వారు. పోలవరంపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో కాలయాపన చేస్తున్నారు. పోలవరం విషయంలో కాలయాపన చేయొద్దు. కేసుల కోసం భయపడితే చరిత్ర హీనులు అవుతారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తారా?. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రాష్ట్రానికి భారీ నష్టం.’’ అని అన్నారు. 

 

 

నీళ్లు లేకుండా పవర్‌ ప్రాజెక్ట్‌ ఏం చేసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆరోపణలు చేసేముందు ఆలోచించి చేయాలని, అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని ఆయన విమర్శించారు. ‘‘16 జాతీయ ప్రాజెక్ట్‌à°² పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. పోలవరం కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?. ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వకుండా పవర్‌ ప్లాంట్‌ ఎందుకు?. విభజన బాధలో పోలవరం ప్రాజెక్ట్‌ మనకు వచ్చింది. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ 70శాతం పూర్తైంది. కనీసం రోడ్లకు గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పండి. ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచేసి నెపం మాపై నెడతారా?. పోలవరంలో ఏడాదిన్నరగా మీరు ఏం చేశారు?. తప్పుడు పనులు మీరు చేసి మాపై ఆరోపణలా?. వైసీపీ నేతలు నిధులు తెచ్చుకోలేక ఇతరులపై ఏడుస్తున్నారు. సీఎం జగన్‌ వచ్చాక సాగునీటి ప్రాజెక్ట్‌లకు గ్రహణం పట్టింది. ఒక్క ప్రాజెక్ట్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. సీఎం జగన్‌కు సంస్కారం లేదు.. సభలో ఇష్టానుసారం మాట్లాడారు.’’ అని చంద్రబాబు అన్నారు.