ఏలూరు ఘటనపై కలెక్టర్ నివేదిక

Published: Monday December 07, 2020

ఏలూరు ఘటనపై కలెక్టర్‌ నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటివరకూ వింత వ్యాధి à°’à°•à°°à°¿ నుంచి à°’à°•à°°à°¿à°•à°¿ వ్యాపించలేదన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. బాధితులకు మూర్ఛ ఒకసారి మాత్రమే వస్తోందన్నారు. మున్సిపల్‌ నీరు పంపిణీలేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. నిత్యం మినరల్‌ వాటర్‌ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. నీటి శాంపిల్స్‌, రక్త నమూనాల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయన్నారు. ఇంకా కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని నివేదికలో కలెక్టర్‌ వెల్లడించారు. విశ్లేషణ కోసం సీసీఎంబీకి నమూనాలు పంపామన్నారు. కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతకు గురైనట్టు గుర్తించామని కలెక్టర్‌ వెల్లడించారు.