వింద్య ఆర్గానిక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published: Saturday December 12, 2020

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో పెద్ద శబ్దాలతో కంపెనీ మొత్తం పేలిపోయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 120 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.