పోలవరంపై జలశక్తి మంత్రికి సీఎం వినతి

Published: Thursday December 17, 2020

రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. à°ˆ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, పురోగతి, ప్రస్తుత పరిస్థితి, పునరావాసం, భూసేకరణ, పరిహారం చెల్లింపు, నిర్మాణ వ్యవధి లక్ష్యం తదితర అంశాలపై దాదాపు 40 నిమిషాలు చర్చించారు. à°ˆ సందర్భంగా జగన్‌ కేంద్ర మంత్రికి పోలవరంపై వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా జాప్యం జరిగితే నిర్మాణ వ్యయం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నందున..

 

తక్షణమే తాజా సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల సూచీని అనుసరించి రూపొందించిన రెండో సవరణ అంచనా వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదించాలని కోరారు. నిర్వాసిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిపోయిందని.. à°ˆ కారణంగా సహాయ పునరావాసం (ఆర్‌ అండ్‌ ఆర్‌) ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని షెకావత్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉందని.. à°† మొత్తాన్ని వెంటనే రీయింబర్స్‌ చేయాలని అభ్యర్థించారు.

 

2018 డిసెంబరు నెలకు సంబంధించిన à°ˆ బిల్లులు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎం పేషీ వర్గాలు తెలిపాయి. మరో పది రోజుల్లో పోలవరం పరిశీలనకు రాబోతున్న ట్లు షెకావత్‌ చెప్పారని వెల్లడించాయి. షెకావత్‌తో భేటీ పూర్తికాగానే జగన్‌ రాష్ట్రానికి బయల్దేరారు.