మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా

Published: Saturday December 19, 2020

 à°ªà±‹à°²à±€à°¸à± శాఖపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. తన్నులు తిని వైకాపా వాళ్లతో మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని సీఎం జగన్‌రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండని విమర్శించారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారని ఆరోపించారు. వైసీపీ గూండాల నుంచి సాటి పోలీసులను కాపాడుకోలేని వాళ్లు.. వాస్తవాలు తెలిసినా కళ్లకి గంతలు కట్టుకొని.. ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ‘‘పోలీస్ గాయపడ్డారని మీరే అంటున్నారు.. మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారని.. ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా’’ అని ప్రశ్నించారు. à°† వీడియోలు ఎందుకు బయటపెట్టలేదన్నారు. బాడీవేర్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు. ‘వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు.. అందుకే నేను విడుదల చేస్తున్నా’ అని లోకేష్‌ ట్వీట్ చేశారు.