ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు

Published: Sunday December 20, 2020

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉధయం వరకు ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో రాష్ట్రంలో 8,78,723 కరోనా కేసులునమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 7,076 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 4,202 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,67,445 మంది రికవరీ అయ్యారు. కరోనాతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

 

తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,81,414కి చేరగా 1,513 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి