రైతు సంఘాలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

Published: Saturday December 26, 2020

జిల్లాలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో పది అంతకంటే ఎక్కువ మంది రైతులు సంఘాలగా ఏర్పడితే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పేరుతో రూ.12 లక్షల నుంచి 15 లక్షల విలువ చేసే ట్రాక్టర్‌, యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని à°† సంఘం రైతులతోపాటు మిగిలిన కొంతమంది రైతులకు అద్దెకు వినియోగించుకుని ప్రయోజనం పొందాలన్నది దాని ఉద్దేశం. ఇందులో 40 శాతం రాయితీ, 10 శాతం సంఘం వాటా, మిగిలిన 50 శాతం బ్యాంకు అప్పు. అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో అప్పు చెల్లించే విధంగా పథకం రూపొందించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 660 రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పడిన 660 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు మంజూరుకు సిద్ధం చేశారు. 

 

యూనిట్‌ గ్రౌండింగ్‌ చేసే సమయంలో తాజాగా ట్రాక్టర్‌ లేదని కేవలం యాంత్రీకరణ పరికరాలేనని అధికారులు సెలవిచ్చారు. దీంతో కొన్ని రైతు సంఘాలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి. à°’à°• రైతు భరోసా కేంద్రంలో à°’à°• సంఘానికే మంజూరయ్యే అవకాశం ఉండడం, అందులో 40 శాతం రాయితీ ఉండడంతో అధికార పార్టీ నాయకులకు అనుచరులుగా ఉన్నవారే సంఘాలుగా ఏర్పడ్డారు. వారిలోనూ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. à°’à°• సంఘానికే అవకాశం ఉండడంతో అధికారులు ఎవరు ఎమ్మెల్యే లెటర్‌ తెస్తారో à°† సంఘానికి మంజూ రు చేస్తామని చెప్పారు. అలాంటి చోట్ల ఇంకా ఎటువంటి మంజూరు ఇవ్వలేదు. ప్రభుత్వ షరతులతో బ్యాంక్‌లో ఖాతాలను తెరిచాక ట్రాక్టర్‌ లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో రైతు పథకానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది. అయితే ఇప్పటికే మంజూరు ఇచ్చిన ఆయా రైతు సంఘాలు తీసుకునే యాంత్రీకరణ పరికరాలను స్థానిక రైతులకు అద్దెకు ఇచ్చేలా ఒప్పందం రాయించుకున్నారు. తీరా యాంత్రీకరణ పరికరాలు ఎంపిక చేసుకునే సమయంలో ట్రాక్టర్‌ ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనా