శ్రీవారి ఆలయంలో భక్తుల ఆందోళన

Published: Saturday December 26, 2020

శ్రీవారి ఆలయంలో శ్రీవాణి ట్రస్ట్ భక్తుల ఆందోళనపై ఏఎస్పీ మునిరామయ్య స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్టు కలిగిన  భక్తులు లఘు దర్శనంలో స్వామి వారి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారని తెలిపారు. భక్తులకు అవగాహన లేకుండానే ఇలా చేశారని చెప్పారు. భక్తులకు... భక్తులకు మధ్యే తోపులాటలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆలయంలో జరిగిన వివాదంపై కొంత మంది భక్తులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేసి పంపించేశామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.