ధర్మకర్త హోదా నుంచి అశోక్‌ గజపతిరాజు తొలగింపు

Published: Saturday January 02, 2021

 à°®à±‚డు ప్రముఖ దేవస్థానాల ధర్మకర్త హోదా నుంచి మాజీమంత్రి, విజయనగరం రాజవంశీకుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజును ప్రభుత్వం తొలగించింది. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగించింది. ఆయనకు à°ˆ హోదా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవదాయశాఖ మెమో ఇచ్చింది. తాజా పరిణామంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

 

ఇప్పటికే అశోక్‌ గజపతిరాజును ప్రతిష్ఠాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్‌ పదవి నుంచి జగన్ సర్కార్ తొలగించింది. అలాగే.. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. à°ˆ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది ఏపీ సర్కార్. తాజాగా మూడు దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.