ఆలయాలపై దాడులు చేసేది వాళ్లే

Published: Tuesday January 05, 2021

 à°°à°¾à°œà°•à±€à°¯ దురుద్దేశాలతోనే ఆలయాలపై అర్థరాత్రి దాడులు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా దాడులు  చేసే వారే... సోషల్‌ మీడియాలో మళ్లీ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. జన సంచారం లేని ఆలయాలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనేదే వారి లక్ష్యమన్నారు. సంక్షేమ ఫలాలను జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీస్తున్నారని దుయ్యబట్టారు. 

 

 

రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేసేవారికి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించారు. గుళ్లు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ ఫేర్ జరుగుతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.