వినాశకాలే విపరీత బుద్ధి

Published: Wednesday January 06, 2021

 à°†à°‚ధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. చాలా కిరాతకమని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. బుధవారం హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ à°ˆ ఘటనను పూర్తిగా ఖండించమేకాదు.. విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. ఇప్పటి వరకు సుమారు రాష్ట్రంలోని 127 గుళ్లపై అనేక రకాల దాడులు జరిగాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో రథంపై మూడు వెండి సింహాలు మాయమయ్యాయని, దానిపై ప్రభుత్వం పట్టించుకోలేదని, అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని మండిపడ్డారు. 

 

ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. ఒకసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో యువత, రైతులు, కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.