వాట్సాప్ సరికొత్త ప్రైవసీ ...అంగీకరించాలా? వద్దా?

Published: Monday January 18, 2021

వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానాన్ని అంగీకరించాలా? వద్దా? అనేది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని తేల్చి చెప్పింది. దాని నిబంధనలను అంగీకరించేవారు అందులోనే కొనసాగవచ్చని, లేని వారు బయటకు వచ్చేయవచ్చని సోమవారం తెలిపింది. వాట్సాప్ అనేది à°“ ప్రైవేటు యాప్ అని, అందులో చేరవద్దని పిటిషనర్‌తో పేర్కొన్న జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ.. అది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని, దాని నిబంధనలు అంగీకరించడానికి బదులు కొత్త యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాట్సాప్ కొత్త పాలసీని సవాలు చేస్తూ à°“ లాయర్ కోర్టుకెక్కగా, ధర్మాసనం ఇలా స్పందించింది.  

 

 

చాలా వరకు మొబైల్ యాప్‌à°² నియమ నిబంధనలు ఇలానే ఉంటాయని, మీరు వాటిని చదివితే కనుక ఎటువంటి షరతులకు అంగీకరించినదీ తెలిసి ఆశ్చర్యపోతారని కోర్టు పేర్కొంది. చివరికి గూగుల్ మ్యాప్స్ కూడా మీ డేటా మొత్తాన్ని సేకరించి స్టోర్ చేస్తుందని కోర్టు తెలిపింది. పిటిషనర్ ప్రకారం ఎలాంటి డేటా లీకవుతుందన్న విషయం అర్థం కాలేదని, సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే, సమయాభావం కారణంగా ఇప్పుడు కుదరదని, à°ˆ నెల 25à°¨ పరిశీలిద్దామని పేర్కొంది. కేంద్రం కూడా ఇందుకు అంగీకరించింది. సమస్యను విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

 

వాట్సాప్, ఫేస్‌బుక్ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీలు మాట్లాడుతూ.. పిటిషన్‌లో పస లేదని, అందులోని చాలా అంశాలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ప్రైవేటు చాట్ మెసేజ్‌లు మాత్రం ఎన్‌క్రిప్ట్‌గానే ఉంటాయని, వాట్సాప్ వాటిని స్టోర్ చేయదని కోర్టుకు తెలిపారు. కొత్త పాలసీలోనూ ఇది మారబోదన్నారు. కొత్త విధానం బిజినెస్ చాట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.