వైసీపీ ప్రభుత్వానికి షాక్

Published: Friday January 22, 2021

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. à°ˆ నేపథ్యంలోనే పిటిషన్‌ను వెనక్కిచ్చేసింది. à°ˆ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. à°ˆ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఆపాలని, హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదంటూ జగన్ సర్కార్ వాదిస్తోంది. కానీ ఇప్పుడు సుప్రీంలో కూడా షాక్ తగలడంతో ఇక ఎటు వెళుతుందో వేచి చూడాలి.